తిరుపతి నగరానికి చెందిన ప్రముఖ రంగస్థలి నటుడు ప్రకాశ్ రాజు(82) కన్నుమూశారు. ఐదు దశాబ్దాలుగా నాటక రంగానికి ఎనలేని సేవలు అందించిన ఆయన అసెంబ్లీ రౌడీ, రాయలసీమ రామన్న చౌదరి చిత్రాల్లో నటించారు. కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం రాత్రి కన్నుమూశారు. ఆయన మృతికి పలువురు ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు.
అశోక్ సామ్రాట్, రాణా ప్రతాప్, పృధ్వీరాజ్, చాణక్య చంద్రగుప్త, విశ్వనాథ నాయకుడు, లేపాక్షి, అక్భర్ అంతిమ ఘడియలు వంటి నాటలకాలతో మంచి పేరు తెచ్చుకున్న ప్రకాశ్ రాజు 1977లో భవాని కళానికేతన్ నాటక సంస్థను ఏర్పాటు చేసి కళాకారులను ప్రోత్సహించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.