శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని శ్రీనగర్లో త్వరలో బస్సు బోటు అందుబాటులోకి రానున్నది. నగరంలోని జల మార్గాల్లో బస్సు పడవను ఇటీవల నడిపి పరీక్షించారు. ఏసీ, మ్యూజిక్ సిస్టమ్ వంటి ఆధునిక సౌకర్యాలున్న ఈ స్పీడ్ బోట్లో సుమారు 25 మంది ప్రయాణించవచ్చు.
రహదారులపై రద్దీని తగ్గించేందుకు ప్రభుత్వం బస్సు బోటులను ప్రవేశపెడుతున్నదని మెరైన్ ఎక్విప్మెంట్ సరఫరా డైరెక్టర్ ఇమ్రాన్ మాలిక్ తెలిపారు. శ్రీనగర్లో 75 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న జీలం నది వెంబడి ఉన్న పలు ప్రాంతాలకు బస్సు పడవల సేవలను త్వరలో ప్రారంభిస్తామని ఆయన చెప్పారు.