ప్రగతి పనులు నిత్యం పర్యవేక్షించాలి
పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
కలెక్టర్తో వీడియో కాన్ఫరెన్స్
నారాయణపేట టౌన్, జూన్ 16: వానకాలం ప్రారంభం అయినందున గ్రామా ల్లో, పట్టణాలలో మురుగు, చెత్త జమ అ య్యి రోగాలు ప్రబలే అవకాశం ఉంటుంద ని, పరిస్థితి రాకుండా పల్లె ప్రగతి పనుల ను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర పం చాయతీ రాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్తో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. గ్రామాల్లో తడి, పొడి చెత్త సేకరణ చేపట్టి, పారిశుధ్య పనులు ని ర్వహించడం ద్వారా స్వచ్ఛ ప్రాంతాలుగా తయారు చేయాలన్నారు.
పల్లె ప్రగతి పను లు పకడ్బందీగా నిర్వహించేందుకుగానూ జిల్లా పంచాయతీ, మండల అభివృద్ధి అధికారులు పల్లె నిద్ర చేసి ప్రగతి పనులను పర్యవేక్షించాలన్నారు. వైకుంఠధామాలు, సెగ్రిగేషన్ షెడ్ల నిర్మాణ పనులను వందశా తం పూర్తి చేయాలన్నారు. ప్రతి రెండు నెలలకోసారి గ్రామసభలు నిర్వహించాలని ఆ దేశించారు. హరితహారం కార్యక్రమాన్ని వి జయవంతం చేయాలని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ ల్లో 10శాతం నిధులను హరితహారం కార్యక్రమానికి ఖర్చుచేయాలన్నారు. ప్రతి మం డలంలో కనీసం 10 ఎకరాల స్థలంలో ఒక మెగా నర్సరీ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా మెగా ప్రకృతి వనాన్ని ఏర్పాటు చే యాలన్నారు. ప్రత్యేక ట్రిబ్యునల్ ద్వారా వచ్చిన భూ సమస్యలను వందశాతం పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని, ఫుడ్ ప్రాసెసింగ్ కేంద్రాల ఏర్పాటుకు స్థలా న్ని గుర్తించాలన్నారు. కరోనా హైరిస్క్ పర్సన్లను గుర్తించి ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ వేసే లా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కలెక్టర్ హరిచందన మాట్లాడుతూ జిల్లాలోని లోకల్ బాడీలను క్రమబద్ధీకరించి, అన్ని మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులను సాధించే విధంగా చర్యలు తీపుకుంటున్నామన్నారు. మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో చెత్త సేకరణ సజావుగా నిర్వహించి, పారిశుధ్య చర్యలను పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే 50 శా తం గుంతలు తవ్వించామని, మిగిలిన వా టిని పూర్తి చేసి నిర్దేశిత లక్ష్యం మేరకు మొ క్కలు నాటేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. వీసీలో అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, ఎఫ్ఆర్వో నారాయణరావు, డీపీవో మురళి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి శైలజ, డీఆర్డీవో గోపాల్, ఆర్ఆండ్బీ డీఈ రాములు తదితరులు పాల్గొన్నారు.