నల్లగొండ : నల్లగొండ – ఖమ్మం – వరంగల్ పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కాగా, ఎమ్మెల్సీ నియోజకవర్గంలోని 12 జిల్లాల నుంచి బ్యాలెట్ బాక్సులు నల్లగొండలో కౌంటింగ్ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్కు చేరుకున్నాయి. అధికారులు బ్యాలెట్ బాక్సుల నిర్వహణను పకడ్బందీగా చేపట్టారు. స్ట్రాంగ్ రూమ్స్ వద్ద
ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, భద్రతా ఏర్పాట్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, డీఐజీ ఏవీ రంగనాధ్ పరిశీలించారు. పోటీ చేసిన అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్స్ కు సీల్ వేస్తామని వారు తెలిపారు.