బీర్కూర్/బిచ్కుంద/నిజాంసాగర్/పిట్లం/దోమకొండ /మాచారెడ్డి, మే 4: రాష్ట్రంలో కుల, మతాలకు తావులేదని, సీఎం కేసీఆర్కు అందరూ సమానమేనని ఎంపీపీ తిలకేశ్వరి రఘు అన్నారు. రంజాన్ పండుగను పురస్కరించుకొని ప్రభుత్వం సరఫరా చేసిన గిఫ్ట్ ప్యాక్లను 250 మంది ముస్లిములకు మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ బతుకమ్మ పండుగకు హిందువులకు సారెలను, క్రిస్మస్ పండుగకు క్రైస్తవులకు దుస్తులు, రంజాన్ పండుగకు ముస్లిములకు గిఫ్ట్ ప్యాక్లు అందజేస్తున్నదన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ స్వరూప, తహసీల్దార్ గణేశ్, ఎంపీడీవో రాధమ్మ, కో-ఆప్షన్సభ్యుడు ఆరిఫ్, తిమ్మాపూర్ ఎంపీటీసీ సావిత్రి, బీర్కూర్, తిమ్మాపూర్ రైతుబంధు సమితి కన్వీనర్లు అవారి గంగారాం, కొరిపెల్లి రాంబాబు, నాయకులు శ్రీనివాస్, డీకొండ మురళి, మన్నన్, ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు.
బిచ్కుంద, మే 4 : బిచ్కుంద మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అశోక్ పటేల్ ముస్లిములకు గిఫ్ట్ ప్యాక్లను అందజేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ భారతి రాజు, టీఆర్ఎస్ మండల ఆధ్యక్షుడు వెంకట్రావు, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు రాజుపటేల్, మైనార్టీ నాయకులు పాషా సేట్ తదితరులు పాల్గొన్నారు.
ముస్లిముల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని గున్కుల్ సొసైటీ చైర్మన్ వాజిద్అలీ అన్నారు. నిజాంసాగర్ మండలంలోని గున్కుల్ గ్రామంలో ముస్లిములకు మంగళవారం రంజాన్ గిఫ్ట్ ప్యాక్లను పంపిణీ చేశారు. పేద, ధనిక తేడా లేకుండా రంజాన్ పండుగను ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకోవాలన్న ఉద్ధేశంతో గిఫ్ట్ ప్యాక్లను సరఫరా చేశారని అన్నారు. కార్యక్రమంలో నాయకులు అఫ్జల్, రాజు, సురేశ్, లచ్చన్న తదితరులు పాల్గొన్నారు. మండలంలోని బుర్గుల్ గ్రామంలో సర్పంచ్ సవేరాబేగం ముస్లిములకు గిఫ్ట్ ప్యాక్లను అందజేశారు. కార్యక్రమంలో నాయకులు జీవన్, మనీష్రెడ్డి, సాయాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
పిట్లం మండలంలోని చిన్నకొడప్గల్ గ్రామం లో విండో చైర్మన్ నారాయణరెడ్డి ముస్లిములకు గిఫ్ట్ ప్యాక్లు అందజేశారు. కంభాపూర్ గ్రామంలో కారేగాం విండో వైస్ చైర్మన్ సంగప్ప గ్రామంలోని పేద ముస్లిములకు గిఫ్ట్ ప్యాక్లు అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్రెడ్డి, నారాయణ, శ్రీనివాస్, మాణిక్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దోమకొండ మండల కేంద్రంలో ముస్లిములకు రంజాన్ గిఫ్ట్ ప్యాక్లను జడ్పీటీసీ తిర్మల్గౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఐరేని నర్సయ్య మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదలు సైతం పండుగలను సంతోషంగా జరుపుకోవాలనే ఉద్ధేశంతో రాష్ట్ర ప్రభుత్వం గిఫ్ట్ ప్యాక్లను అందజేస్తున్నదని తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీకాంత్, ఎంపీటీసీలు శారద నాగరాజు, శంకర్, రమేశ్, నాయకులు శేఖర్, సలాం తదితరులు పాల్గొన్నారు.
మాచారెడ్డి మండలంలోని గజ్యానాయక్తండాలో వివిధ గ్రామాలకు చెందిన ముస్లిములకు టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు హంజీనాయక్ మంగళవారం రంజాన్ దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అన్ని వర్గాల పండుగలకు తగిన ప్రాధాన్యం ఇస్తున్నదని అన్నారు. కార్యక్రమంలో మండల కో-ఆప్షన్ మెంబర్ అబ్దుల్ఖాన్, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి పగడాల బాల్చంద్రం, ఏఎంసీ మాజీ డైరెక్టర్ షేక్ అజీజ్, వీరహనుమాన్ ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాసాచారి, ఉప సర్పంచ్ కిషన్, ఎండీ అజీజ్, శ్రీధర్రావు తదితరులు పాల్గొన్నారు.