నగర ప్రయాణికులకు శుభవార్త. బుధవారం నుంచి ఎంఎంటీఎస్ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. కొవిడ్ కారణంగా 15 నెలల కిందట నిలిచిపోయిన ఈ రైళ్లు 23 నుంచి అందుబాటులోకి రానున్నాయి. లాక్డౌన్తో గతేడాది మార్చి 23న సర్వీసులు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. కొవిడ్ నిబంధనలతో ప్రస్తుతానికి పది రైళ్లు నడుపుతామని, మిగతా సర్వీసులు దశల వారీగా పునరుద్ధరిస్తామని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఫలక్నుమా-లింగంపల్లికి 6, లింగంపల్లి- హైదరాబాద్ మధ్య 4 రైళ్లు నడిపించనున్నట్లు తెలిపింది. ప్రయాణికులు తప్పనిసరిగా మాస్కులు, భౌతికదూరం పాటించాలని సూచించింది. తొలి ట్రైన్ ఫలక్నుమా నుంచి ఉదయం 7.50 ప్రారంభమవుతుందని, రాత్రి 7.32 గంటల వరకు సర్వీసులు ముగుస్తాయని ఎస్సీఆర్ అధికారులు వివరించారు. ఈ మేరకు టైం టేబుల్ను విడుదల చేశారు.