న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ తన క్యాబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు చేశారు. బుధవారం సాయంత్రం ఆరు గంటలకు మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని సమాచారం. ఈ క్యాబినెట్ విస్తరణలో వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లతోపాటు ఐదు రాష్ట్రాలకే పెద్ద పీట వేస్తారని తెలుస్తున్నది.
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి ఉత్తరప్రదేశ్ చాలా కీలకం. కనుక అదే పట్టును కొనసాగించాలంటే అన్ని వర్గాల వారిని మెప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. యువకులు, బీసీలు, మహిళలకు ప్రత్యేకించి విద్యావంతులకు క్యాబినెట్ విస్తరణలో ప్రాధాన్యం లభిస్తుందని వినికిడి.
కేంద్రంలో బీజేపీ రెండో దఫా అధికారం చేపట్టిన తర్వాత జరుగుతున్న తొలి మంత్రివర్గ విస్తరణ ఇది. మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకునే దిశగానూ ప్రయత్నాలు సాగిస్తున్నట్లు అధికార వర్గాల కథనం. మొత్తం మోదీ తన క్యాబినెట్లో 24 మంది మహిళలకు చోటు కల్పించే అవకాశమున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
ఇక ప్రస్తుత కేంద్ర మంత్రుల్లో ఒకటి కంటే ఎక్కువ శాఖల బాధ్యతలు నిర్వహిస్తున్న వారిపై పనిభారం తగ్గించాలని ప్రధాని మోదీ భావిస్తున్నారు. అసలు పనితీరు సరిగ్గా లేని వారికి ఉద్వాసన పలికే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఇప్పటికే క్యాబినెట్ విస్తరణపై కేంద్ర హోంమంత్రి అమిత్షా, బీజేపీ సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి బీఎస్ సంతోష్లతో పలు సార్లు ప్రధాని మోదీ చర్చించారు.
ప్రస్తుతం మోదీ క్యాబినెట్లో 52 మంది మంత్రులు ఉన్నారు. ఇటీవల మరణించిన రాం విలాస్ పాశ్వాన్, సురేశ్ అంగడీ, రాజీనామా చేసిన అకాలీదళ్ నాయకురాలు హర్ సిమ్రత్ కౌర్, శివసేనకు చెందిన అరవింద్ సావంత్ స్థానాలను భర్తీ చేస్తారు. కొత్తగా కొత్తగా మరో 20- 25 మందికి క్యాబినెట్లో బెర్త్ లభిస్తుందని వినికిడి.
ఉత్తరప్రదేశ్లో అప్నాదళ్ నేత అనుప్రియా పటేల్, బీజేపీ ఎంపీలు వరుణ్ గాంధీ, రీటా బహుగుణలకు చోటు దక్కనున్నదని సమాచారం. ఇక అసోంలో సీఎంగా వైదొలిగిన సర్బానంద సోనోవాల్, మహారాష్ట్ర మాజీ సీఎం నారాయణ రాణె, ఉత్తరాఖండ్ మాజీ సీఎం తీరత్ సింగ్ రావత్లకు చోటు లభిస్తుందని తెలుస్తున్నది.
బీహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ పేరు కూడా వినిపిస్తున్నది. మధ్యప్రదేశ్ నుంచి జ్యోతిరాదిత్య సింధియా, రాకేశ్ సింగ్, బీహార్లో ఎల్జేపీ నేత పశుపతి కుమార్ పరాస్లకు కేంద్ర మంత్రి పదవులు లభిస్తాయని తెలుస్తున్నది. మహారాష్ట్రలో మాజీ సీఎం నారాయణ రాణెతోపాటు పూనం మహాజన్, ప్రీతం ముండే పేర్లను మోదీ పరిశీలిస్తున్నారని సమాచారం.
బిగ్ బాస్ 5 తెలుగులో ఆలీ ఎంట్రీ.. నిజమెంత?
కర్నాటకం : యడియూరప్పపై టూరిజం మంత్రి తిరుగుబాటు
వరుడికి కట్నంగా ఆక్సిజన్..!
ప్రపంచంలోనే ఎత్తయిన గుర్రం బిగ్ జాక్ ఇకలేదు..!
విస్తారా ఎయిర్లైన్స్ బంపర్ ఆఫర్
రెనాల్ట్ కార్లపై అద్భుతమైన ఆఫర్లు… భారీ డిస్కౌంట్స్…
ఇన్ కమ్ టాక్స్ ఫైల్ చేయడానికి సడలింపులు..
ఏడాదిలో మూడోసారి : టాటా కార్ల ధరలకు రెక్కలు!
రూ.15 లక్షల కోట్లు.. ప్రపంచ కుబేరుల్లో ఇంకా టాప్లోనే బెజోస్
ఆంక్షలపై తగ్గేందుకు సౌదీ ససేమిరా.. సంక్షోభం ముంగిట ఓపెక్?