పుణె: ఇంగ్లాండ్తో మూడు వన్డేల సిరీస్ కోసం టీమ్ఇండియా పుణె చేరుకున్న విషయం తెలిసిందే. అహ్మదాబాద్ నుంచి ఆటగాళ్లు, వారి కుటుంబ సభ్యులతో ప్రత్యేక విమానంలో పుణెలోని టీమ్ హోటల్కు చేరుకున్నారు. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ..అతడి భార్య అనుష్క శర్మ, కూతురు వామిక కనిపించారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఫొటోల్లో అనుష్క..పాపను ఎత్తుకొని ఉండగా కోహ్లీ లగేజీను మోసుకెళ్తున్నాడు.
పాప వామిక ముఖం కనిపించే ఫొటోను ఇప్పటి వరకు విరుష్క షేర్ చేయలేదు.