హైదరాబాద్: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు కరోనా నుంచి సంపూర్ణంగా కోలుకొన్నారు. ప్రస్తుతం తన వ్యవసాయక్షేత్రంలో ఐసొలేషన్లో ఉంటున్న ముఖ్యమంత్రికి ఆయన వ్యక్తిగత వైద్యుడు ఎంవీరావు ఆధ్వర్యంలోని వైద్య బృందం మంగళవారం కొవిడ్ పరీక్షలు నిర్వహించింది. ర్యాపిడ్ యాంటిజెన్తోపాటు ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో నెగెటివ్ వచ్చింది. రక్తపరీక్షల రిపోర్టులు కూడా సాధారణంగా ఉన్నట్టు తేలింది. దీంతో సీఎం కేసీఆర్ కరోనా నుంచి పూర్తిగా కోలుకొన్నట్టు వైద్యులు నిర్ధారించారు.