టీఆర్ఎస్ నాయకులు, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమానికి అపూర్వ స్పందన లభిస్తోంది. టోక్యో ఒలింపిక్స్లో విజయం సాధించిన మీరాబాయి చాను మణిపూర్లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొని మొక్కలు నాటారు. పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మీరాబాయి పేర్కొన్నారు.
49 కేజీల వెయిట్లిఫ్టింగ్ కేటగిరిలో సిల్వర్ మెడల్ను సాధించిన మీరాబాయికి ఎంపీ సంతోష్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొన్న మీరాబాయిని ఆయన అభినందించారు. సిల్వర్ మెడల్ సాధించి భారతీయుల హృదయాలను గెలుచుకున్న ఆమె.. మొక్కలు నాటి ఆదర్శంగా నిలిచిందన్నారు.