ముంబై: చెన్నై సూపర్ కింగ్స్ నిర్దేశించిన 189 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్కు అదిరే శుభారంభం లభించింది. ఓపెనర్లు పృథ్వీ షా, శిఖర్ ధావన్ ధనాధన్ బ్యాటింగ్తో అలరిస్తున్నారు. వీళ్లిద్దరూ చెన్నై బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. శామ్ కరన్ వేసిన నాలుగో ఓవర్లో ధావన్ వరుసగా 4,6 బాదగా..ఆఖరి బంతికి షా బౌండరీ కొట్టడంతో 17 రన్స్ వచ్చాయి. పవర్ ప్లే ముగిసేసరికి ఢిల్లీ వికెట్ నష్టపోకుండా 65 పరుగులు చేసింది. ప్రస్తుతం షా(36), ధావన్(29) క్రీజులో ఉన్నారు.