హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగించే ధూమపానానికి ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలని జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్, స్టార్ ప్లేయర్ పీవీ సింధు సూచించారు. కరోనా సమయంలో పొగాకు ఉత్పత్తుల వినియోగం మరింత ప్రమాదకరమని, అందుకే వాటిని వీడాలని చెప్పారు. సోమవారం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం సందర్భంగా ఓ వర్చువల్ కార్యక్రమంలో సింధు, గోపీచంద్ మాట్లాడారు.