కోల్కతా : బీజేపీలోకి దూకిన ఇద్దరు ఎంపీలను అనర్హులుగా ప్రకటించాలని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ స్పీకర్ను మరోమారు కోరింది. లోక్సభలో టీఎంసీ నాయకుడు సుదీప్ బందోపాధ్యాయ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో గురువారం టెలిఫోన్ సంభాషణ జరిపారు. టీఎంసీని వీడి బీజేపీలో చేరిన పార్టీ ఎంపీలు శిశిర్ అధికారి, సునీల్ మొండల్పై పార్టీ ఫిరాయింపుల వ్యతిరేక నిరోధక చట్టం కింద వేటు వేయాల్సిందిగా కోరారు. ఈ విషయమై గడిచిన జనవరి, మే నెలలో రెండు లేఖలు కూడా పంపించినట్లు తెలిపారు. 2019 సార్వత్రిక ఎన్నికలలో కాంతి ఎంపీ శిశిర్ అధికారి, బర్ధమన్ పూర్బా ఎంపీ సునీల్ మొండల్ తృణమూల్ టిక్కెట్లపై గెలిచిన తీరా అసెంబ్లీ ఎన్నికలకు ముందే బీజేపీలోకి మారారు. కానీ వారు పదవి నుంచి తప్పుకోలేదు.