కోల్కతా: పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు అయిదు దశల పోలింగ్ ముగిసింది. ఇంకా మూడు దశల పోలింగ్ నిర్వహించాల్సి ఉంది. ఆరు, ఏడు, ఎనిమిదవ దశల పోలింగ్ను ఒకేసారి నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని తృణమూల్ పార్టీ కోరింది. దీనికి సంబంధించిన ఓ లేఖను సమర్పించింది. కరోనా వైరస్ నేపథ్యంలో ఎన్నికల ర్యాలీలను కూడా తృణమూల్ రద్దు చేసుకున్నది. మరో వైపు బీజేపీ కూడా ఎన్నికల ప్రచార సభలను రద్దు చేసుకుంటున్నట్లు చెప్పింది. ప్రస్తుతం గత నాలుగు రోజుల నుంచి దేశవ్యాప్తంగా రెండు లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు అవుతున్న విషయం తెలిసిందే.