గవర్నర్ను తక్షణమే తొలగించండి.. రాష్ట్రపతికి ఎంపీల మెమొరాండం

కోల్కతా: పశ్చిమబెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి, గవర్నర్ జగదీప్ ధన్కర్కు మధ్య వివాదం మరింత ముదిరింది. అదీ ఎంతలా అంటే గవర్నర్, టీఎంసీ ఎంపీలు ఒకరిపై ఒకరు దూషణలు చేసుకునే వరకు వ్యవహారం వెళ్లింది. ఈ నేపథ్యంలో గవర్నర్ జగదీప్ ధన్కర్ను వెంటనే ఆ పదవి నుంచి తప్పించాలంటూ తృణమూల్ ఎంపీలు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు మెమొరాండం సమర్పించారు.
టీఎంసీ ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్ పేరుతో రాష్ట్రపతికి పంపిన ఈ మెమొరాండంపై ఇతర టీఎంసీ ఎంపీలు సుదీప్ బంధోపాధ్యాయ్, డెరెక్ ఓబ్రియాన్, కళ్యాణ్ బెనెర్జి, ఎంపీ కకోలి ఘోష్ దస్తిదార్ సంతకాలు చేశారు. కాగా, రాష్ట్రంలో రాజ్యాంగ విలువలను కాపాడటంలో గవర్నర్ ధన్కర్ పూర్తిగా విఫలమయ్యారని, ఆయన పదేపదే చట్టాలను ఉల్లంఘించారని తమ మెమొరాండంలో పేర్కొన్నట్లు ఎంపీలు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- ఇది అహ్మదాబాద్కు గొప్ప బహుమతి : మోదీ
- 5 వికెట్లతో అరుదైన క్లబ్లో మహ్మద్ సిరాజ్
- విద్యుత్ ఉద్యోగుల పాత్ర చిరస్మరణీయం : మంత్రి కేటీఆర్
- 'హైదరాబాద్ నెక్లెస్రోడ్ను తలదన్నేలా సిద్దిపేట నెక్లెస్రోడ్'
- రిపబ్లికన్ నేత ట్విట్టర్ అకౌంట్ లాక్.. ఎందుకో తెలుసా ?
- బూర్గుల నర్సింగరావు మృతి.. కేటీఆర్ సంతాపం
- కమెడీయన్స్ గ్రూప్ ఫొటో.. వైరల్గా మారిన పిక్
- ఇక మీ ఇష్టం.. ఏ పార్టీలో అయినా చేరండి!
- వాఘాలో ఈ సారి బీటింగ్ రిట్రీట్ ఉండదు..
- గుంటూరు జిల్లాలో విషాదం.. ప్రేమజంట ఆత్మహత్య