హైదరాబాద్: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సజావుగా సాగుతున్నది. పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, తమిళనాడులో డీఎంకే తమ సత్తా చాటుతున్నాయి. బెంగాల్లో మొత్తం 294 స్థానాలకుగాను పశ్చిమబెంగాల్ 173 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా, తమిళనాడులో 234 స్థానాలకుగాను డీఎంకే 136 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తున్నది. గత ఎన్నికల ఫలితాలతో పోల్చితే టీఎంసీ మరో 10 స్థానాల్లో అదనంగా ఆధిక్యత కనబరుస్తుంది. డీఎంకే సైతం గత ఎన్నికల్లో గెలిచిన స్థానాల కంటే 38 స్థానాల్లో అదనంగా ఆధిక్యంలో ఉన్నది.
అదేవిధంగా కేరళలో అధికార ఎల్డీఎఫ్ కూటమి 86 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నది. ప్రతిపక్ష యూడీఎఫ్ కేవలం 49 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉన్నది. అయితే గత ఎన్నికల ఫలితాలతో పోల్చితే లెఫ్ట్ కూటమి 10 స్థానాలు వెనుకబడింది. ఇక అసోంలో అధికార బీజేపీ, దాని మిత్రపక్షాలు 85 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ప్రతిపక్ష కాంగ్రెస్, దాని మిత్రపక్షాల ఆధిక్యం కేవలం 40 స్థానాలకు పరిమితమైంది. పుదుచ్చేరిలో ఎన్ రంగస్వామి కాంగ్రెస్ అధికారం ఏర్పాటు చేసే దిశగా దూసుకెళ్తున్నది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి
‘తిరుపతి’లో 70 వేల ఆధిక్యంలో వైసీపీ
భార్యను వేట కొడవలితో నరికి చంపిన భర్త
టోలిగంజ్లో కేంద్రమంత్రి బాబుల్ సుప్రియో వెనుకంజ
సాగర్ ఉప ఎన్నిక ఫలితం.. 4 వేల ఓట్ల మెజార్టీతో భగత్ ముందంజ