కోల్కతా : ప్రత్యేక ఉత్తర బెంగాల్ ఏర్పాటును డిమాండ్ చేసినందుకు పాలక టీఎంసీ బీజేపీ నేతలు జాన్ బర్లా, సౌమిత్రా ఖాన్పై ఫిర్యాదు చేసింది. బెంగాల్ను విడగొట్టేందుకు కాషాయ పార్టీ నేతలు ప్రయ్నతిస్తున్నారని ఆరోపించింది. నార్త్ బెంగాల్ను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించానలి ఎంపీ జాన్ బర్లా కోరినప్పటి నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లలో ఆయనపై నాలుగు ఫిర్యాదులు నమోదయ్యాయి.
పశ్చిమ ప్రాంతంలోని జంగల్మహల్ ప్రాంతంలోనూ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఊపందుకుంటోందని పేర్కొన్న బీజేపీ ఎంపీ సౌమిత్ర ఖాన్పైనా పాలక టీఎంసీ శ్రేణులు మండిపడుతున్నాయి. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం జంగల్మహల్ పరిధిలోని పురూలియా, బంకురా, జర్గాం జిల్లాలను దాటి బీర్భం, వర్ధమాన్, అసన్సోల్, తూర్పు పశ్చిమ మిడ్నపూర్ జిల్లాలకూ పాకిందని సౌమిత్రా ఖాన్ పేర్కొన్నారు. ఇక బీజేపీ నేతలు పార్టీ విధానానికి అనుగుణంగా వ్యాఖ్యలు చేయాలని బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ సూచించారు. అంతర్గత వేదికలపై తమ వ్యక్తిగత అభిప్రాయాలను వెల్లడించవచ్చని చెప్పారు.