నల్లగొండ : కారు గుర్తుకు ఓటు వేయడం ద్వారానే రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాయని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అదే గుర్తుకు ఓటు వేయడం ద్వారానే యావత్ ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా వ్యవసాయానికి పెట్టుబడిని అందించే రైతుబంధు పథకానికి శ్రీకారం చుట్టామన్నారు. కారు గుర్తుకు ఓటు వేస్తే నకిరేకల్ పట్టణ రూపురేఖలు మారుస్తామన్నారు.
నకిరేకల్ మున్సిపాలిటీకి జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజు టీఆర్ఎస్ శ్రేణులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. నకిరేకల్ పట్టణ ప్రగతిని కాంక్షించే ప్రతి ఓటరు కారు గుర్తుకు ఓటేయలన్నారు.
సబ్బండ వర్ణాల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్గా నిలిపారన్నారు. నకిరేకల్ పట్టణ అభివృద్ధి టీఆర్ఎస్కు మాత్రమే సాధ్యమవుతుందన్నారు.
అభివృద్ధిని ఆదరించి టీఆర్ఎస్ని గెలిపించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో చిరుమర్తి లింగయ్య, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ రావు, రాజ్యసభ సభ్యుడులు బడుగుల లింగయ్య యాదవ్, తుంగతుర్తి ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్ కుమార్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఓరుగల్లులో గెలుపు టీఆర్ఎస్దే : మంత్రులు
దేశంలో 60 శాతం వరిసాగు తెలంగాణలోనే..
వైద్యులు 24 గంటలు అందుబాటులో ఉండాలి
యాదాద్రిలో స్వాతినక్షత్ర పూజలు
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి
భారత్ మమ్మల్ని వ్యాక్సిన్లు అడగలేదు: అమెరికా