అహ్మదాబాద్: టీ20 క్రికెట్లో 9వేల పరుగులు పూర్తి చేసుకున్న రెండో భారత బ్యాట్స్మన్గా నిలిచిన రోహిత్ శర్మ తాజాగా మరో అరుదైన ఘనత అందుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన రెండో క్రికెటర్గా హిట్మ్యాన్ మళ్లీ తన స్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ జాబితాలో టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
రోహిత్ శర్మ 111 టీ20 మ్యాచ్ల్లో 2864 పరుగులు చేయగా..ఈ ఫార్మాట్లో కోహ్లీ 89 మ్యాచ్ల్లోనే 3159 రన్స్ పూర్తి చేసుకున్నాడు. న్యూజిలాండ్ హార్డ్హిట్టర్ మార్టిన్ గప్తిల్ 99 టీ20ల్లో 2839 పరుగులు నమోదు చేశాడు. ఇంగ్లాండ్తో ఐదో టీ20లో 34 బంతుల్లో 64 పరుగులు చేసిన రోహిత్ తాజాగా గప్తిల్ రికార్డును అధిగమించాడు.