చండీగఢ్, ఆగస్టు 9: పంజాబ్లోని అమృత్సర్ సమీపంలో ధాళికే గ్రామంలో ఓ బ్యాగులో టిఫిన్ బాక్స్ బాంబును పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. 2 కిలోలకు పైగా ఆర్డీఎక్స్తో ఈ బాంబును తయారు చేశారు. అదే బ్యాగులో 5 హ్యాండ్ గ్రనేడ్లు, 100కు పైగా బుల్లెట్లు కూడా ఉన్నట్టు డీజీపీ దిన్కర్ గుప్తా తెలిపారు. రిమోట్ ద్వారా ఆపరేట్ చేసే విధంగా బాంబును తయారు చేశారని, రిమోట్ కూడా దొరికిందని చెప్పారు. పాకిస్తాన్ నుంచి డ్రోన్ ద్వారా పంపి అమృత్సర్లో ఈ బాంబును జారవిడిచినట్టు అనుమానిస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవానికి ఇంకా వారం రోజులు కూడా లేదు. ఈ నేపథ్యంలో ఈ బాంబు ఘటన భద్రతాపరమైన ఆందోళన కలిగిస్తున్నది.