త్రిపుర సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26: సివిల్ సర్వీసు అధికారులు కోర్టు ధిక్కార కేసులకు భయపడవద్దని, ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలని త్రిపుర సీఎం బిప్లవ్ కుమార్ దేవ్ అన్నారు. పోలీసులు అధికారులను అరెస్టు చేయడం అంత సులభంగా జరగదని చెప్పారు. ‘పోలీసులకు బాస్ సీఎం. నేను సీఎం అన్న విషయం మర్చిపోవద్దు’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. దీనిపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. సీఎం అయి ఉండి న్యాయ వ్యవస్థకు వ్యతిరేకంగా ఎలా వ్యాఖ్యలు చేస్తారని విమర్శించాయి. బిప్లబ్ దేవ్ దేశాన్ని అవమానించారని, న్యాయవ్యవస్థను అపహాస్యం చేశారని తృణమూల్ నాయకుడు అభిషేక్ బెనర్జీ విమర్శించారు.