ఛత్తీస్గఢ్ : ఛత్తీస్గఢ్లోని సూరజ్పూర్ జిల్లాలో విషాద ఘటన జరిగింది. బావిలో పూడికతీస్తుండగా పైనుంచి మట్టిపెళ్లలు, భారీగా బురద మట్టి పడటంతో ముగ్గురు కార్మికులు సజీవ సమాధి అయ్యారు. విషయం తెలుసుకున్న అధికారులు ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. స్థానికుల సాయంతో మట్టిని తోడి మృతదేహాలను వెలికితీస్తున్నారు. ఇప్పటివరకు రెండు మృతదేహాలను బయటకు తీసినట్లు సూరజ్పూర్ కలెక్టర్ గౌరవ్ కుమార్ తెలిపారు. మరో మృతదేహం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. ఘటనపై ఆ రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.