శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు ఏరివేత కొనసాగుతున్నది. పుల్వామాలోని (Pulwama) ద్రాబ్గామ్ ప్రాంతంలో మరో ఇద్దరు ముష్కరులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. శనివారం సాయంత్రం జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమైన విషయం తెలిసిందే. దీంతో ఈ సంఖ్య మూడుకు చేరింది. వారంతా లష్కరే తొయీబాకు చెందిన ఉగ్రవాదులని కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ తెలిపారు. వారిని ఫాజిల్ నజీర్ భట్, ఇర్ఫాన్ మాలిక్, జునైద్ షీర్గోజ్రీగా గుర్తించారు. గత నెల 13న అమరుడైన జవాన్ రియాజ్ అహ్మద్ను చంపినవారిలో జునైద్ కూడా ఉన్నాడని చెప్పారు. వీరంతా స్థానికులేనని తెలిపారు.
కాగా, శనివారం ఉదయం కుల్గాం జిల్లాలో కూడా ఎన్కౌంటర్ చోటుచేసుకున్నది. ఖాందీపొరలో ఉగ్రవాది ఉన్నాడన్న సమాచారంలో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించగా ఎదురుకాల్పులు జరిగాయి. ఈ సందర్భంగా హిజ్బుల్ ముజాహిదీన్కు చెందిన రసీక్ అహ్మద్ గనీ హతమయ్యాడు.