హైదరాబాద్, ఏప్రిల్ 10: హైదరాబాద్ శివారు శామీర్పేట సమీపంలోని జీనోమ్ వ్యాలీలో వంద ఎకరాల్లో త్వరలో రాబోతున్న నేషనల్ యానిమల్ రీసోర్స్ ఫర్ బయోమెడికల్ రీసెర్చ్ (ఎన్ఏఆర్ఎఫ్ బీఆర్) కేంద్రానికి సలహాదారుగా సీనియర్ ఐఏఎస్ అధికారి, రిటైర్డ్ స్పెషల్ సీఎస్ బీపీ ఆచార్యను భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్) శనివారం నియమించింది. జీనోమ్ వ్యాలీలో ప్రపంచస్థాయి లైఫ్ సైన్సెస్ క్లస్టర్ రూపకల్పనకు ఆయన అనుభవం ఉపయోగపడనున్నది. ఈ రంగానికి ఆయన సేవలు అందించనున్నారు. ఫార్మారంగంలో రూ.300 కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్టును చేపట్టారు