శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్ పుల్వామా పహు ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులను భదత్రా బలగాలు హతమార్చాయి. లష్కరే తోయిబా ఉగ్రవాదుల కదలికలు ఉన్నట్లు సమాచారం అందడంతో భద్రతా బలగాలు, కశ్మీర్ పోలీసుల సంయుక్త బృందం సెర్చ్ ఆపరేషన్ను ప్రారంభించినట్లు కశ్మీర్ ఐజీపీ విజయ్కుమార్ తెలిపారు.
ఈ క్రమంలో కాల్పులు చోటు చేసుకున్నాయి. బలగాల కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని బలగాలు చుట్టుమిట్టాయి. ఇంకా సైన్యం ఆపరేషన్ కొనసాగిస్తున్నది. ఇదిలా ఉండగా.. శనివారం సాయంత్రం దక్షిణ కుల్గామ్లో జరిగిన ఎన్కౌంటర్లో జైషే మహ్మద్ ఉగ్ర సంస్థకు చెందిన ఇద్దరు పాక్ ఉగ్రవాదులు హతమయ్యారు.