భోపాల్ : మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ శివారు ప్రాంతంలోని బిషన్కేడి గ్రామంలో ఓ శిక్షణ విమానం శనివారం కుప్పకూలడంతో ముగ్గురు పైలట్లు గాయపడ్డారు. గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విమానం నేలకూలిందని అధికారులు పేర్కొన్నారు.
గాయపడిన పైలట్లను సమీప దవాఖానకు తరలించారు. ముగ్గురు పైలట్లతో కూడిన ఈ విమానం భోపాల్ నుంచి గుణ ప్రాంతానికి బయలుదేరింది. ఈ ప్రమాదంలో పైలట్లు స్వల్పగాయాలతో బయటపడటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. విమానం కూలిపోవడానికి కారణాలు ఇంకా తెలియరాలేదు.