Rescue operation: మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుంభవృష్టి కారణంగా ఆ రాష్ట్రంలో పలు గ్రామాలు నీట మునిగాయి. కొన్ని లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరదనీరు చేరడంతో పంట పొలాలు సైతం చెరువులను తలపిస్తున్నాయి. ఆకస్మికంగా వరదలు సంభవించడంతో పలుచోట్ల జనాలు వరదలో చిక్కుకున్నారు. దాంతో అధికారులు ఇండియన్ ఎయిర్ఫోర్స్కు చెందిన ఎంఐ-17 హెలిక్యాప్టర్లను రంగంలోకి దించి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.
ఇందులో భాగంగా వాయుసేన అధికారులు ఓ హెలిక్యాప్టర్ సాయంతో లాతూర్ జిల్లాలోని పొహరెగావ్ గ్రామంలో వరదనీటిలో చిక్కుకున్న వారిని రక్షించారు. వరదలు చుట్టుముట్టడంతో స్థానికంగా ఓ రేకుల షెడ్డుపైకి ఎక్కి సాయం కోసం ఎదురుచూస్తున్న వారిని ఎయిర్ఫోర్స్ అధికారులు సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. ఈ రెస్క్యూ ఆపరేషన్కు సంబంధించిన దృశ్యాలను మీరు కూడా వీక్షించవచ్చు.