రాజ్కోట్: పెట్రోల్ బైక్లు తెలుసు. డీజిల్తోనూ నడిచేవి కొన్ని ఉన్నాయి. కరంటుతో నడిచే ఈ-బైక్లూ అందుబాటులోకి వస్తున్నాయి. అయితే ఈ మూడు ఆప్షన్లు ఉన్న కొత్త తరహా బైక్ను గుజరాత్ విద్యార్థులు అభివృద్ధి చేశారు. రాజ్కోట్కు చెందిన వీవీపీ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు ఈ ‘త్రీ ఇన్ వన్ బైక్’ను తయారు చేశారు. ఈ బైక్లో రెండు స్విచ్లు ఉంటాయి. పెట్రోల్తో నడవాలంటే పెట్రోల్ మోడ్ స్విచ్, డీజిల్తో నడవాలంటే డీజిల్ మోడ్ స్విచ్ నొక్కి నడుపవచ్చు. అంతేకాకుండా దీనిలో నాలుగు బ్యాటరీలను అమర్చారు. ఒక్కో బ్యాటరీ చార్జింగ్ కావడానికి ఆరు గంటలు పడుతుంది. పూర్తిగా చార్జ్ అయిన బ్యాటరీతో 40 కిలోమీటర్ల వరకు వెళ్లొచ్చు. కాలేజీలోని మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం ఏడో సెమిస్టర్ విద్యార్థులు దీనిని ఆవిష్కరించినట్టు డీన్ మానియార్ చెప్పారు.