న్యూఢిల్లీ: బీహార్లో లోక్జనశక్తి పార్టీ (ఎల్జేపీ)లో చీలికకు తనకు ఎలాంటి సంబంధం లేదని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్ చెప్పారు. అది వారి అంతర్గత వ్యవహారమన్నారు. అతడు ప్రచారం కోసమే నాపై చిందులు వేస్తున్నాడని ఎల్జేపీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అంతా తెలిసి కూడా నేనేదో కుట్రపన్నానని ఆరోపిస్తే చేసేదేమీ లేదన్నారు.
అటు తన ఢిల్లీ పర్యటనపై కూడా నితీశ్కుమార్ స్పందించారు. అది తన వ్యక్తిగత పర్యటన అని, కంటి సంబంధ చికిత్స కోసం తాను ఢిల్లీకి వచ్చానని ఆయన చెప్పారు. కేంద్ర క్యాబినెట్ విస్తరణకు సంబంధించి కూడా తనకు ఎలాంటి సమాచారం లేదన్నారు.