కోయంబత్తూరు: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతున్నది. అధికార అన్నాడీఎంకే, ప్రతిపక్ష డీఎంకే పోటీపడి ప్రచారం నిర్వహిస్తున్నాయి. అన్నాడీఎంకే మిత్రపక్షమైన బీజేపీ కూడా గతంలో ఎన్నడూ లేనంతగా తమిళనాడులో ప్రచారం కొనసాగిస్తున్నది. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షాతోపాటు పలువురు జాతీయ స్థాయి బీజేపీ నాయకులు తమిళనాడులో ప్రచారం నిర్వహిస్తున్నారు.
తాజాగా ఇవాళ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కోయంబత్తూరు ఎన్నికల ప్రచారసభలో మాట్లాడిన ఆయన.. డీఎంకే-కాంగ్రెస్ కూటమిపై విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి పళనిస్వామి తల్లి గురించి డీఎంకే నేత ఏ రాజా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో.. డీఎంకే-కాంగ్రెస్ కూటమి నేతలకు తల్లులపై గౌరవం లేదని ఆయన మండిపడ్డారు. స్త్రీలంటే గౌరవం లేనివారికి అధికారంలోకి వచ్చే హక్కు కూడా లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
85 శాతం కొత్త కేసులు ఎనిమిది రాష్ట్రాల్లోనే: కేంద్రం
కొవిషీల్డ్ షెల్ఫ్ లైఫ్ను 9 నెలలకు పొడిగించిన డీసీజీఐ
అమెజాన్ ప్రైమ్ వీడియోలో టెనెట్
మాస్క్ కిందికి.. నేను పైకి.. ముంబై పోలీసుల వినూత్న ప్రచారం
శరద్ పవార్ కు శస్ర్త చికిత్స విజయవంతం
60 ఏళ్ల లోపువారికి ఆస్ట్రాజెనికా టీకా నిలిపివేత..
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
ఆ నాలుగు నగరాల్లో నైట్ కర్ఫ్యూ పొడగింపు..!