న్యూఢిల్లీ: ఫైజర్, మోడెర్నా కరోనా టీకాల క్లినికల్ ట్రయల్స్ను డెల్టా వేరియంట్ ప్రబలిన రెండో వేవ్లో నిర్వహించి ఉంటే వాటికి అనుమతి లభించి ఉండేది కాదని భారత్ బయోటెక్ చైర్మన్, ఎండీ కృష్ణా ఎల్లా అన్నారు. టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డు (టీడీబీ) నిర్వహించిన కార్యక్రమంలో కృష్ణా ఎల్లా మాట్లాడారు. ఫైజర్, మోడెర్నా కరోనా టీకాలకు లైసెన్స్ సాధించినప్పుడు చైనాలో తొలిసారిగా వెలుగు చూసిన ఒరిజినల్ స్ట్రెయిన్ మాత్రమే ఉందన్నారు. అందుకే ఆ టీకాలు 90% ప్రభావశీలత సాధించగలిగాయని, అదే వ్యాక్సిన్ ప్రభావశీలత ఇప్పుడు ఇజ్రాయెల్లో 30 శాతంగా నమోదవుతున్నదని చెప్పారు. శక్తిమంతమైన డెల్టా వేరియంట్ ప్రబలిన రెండో వేవ్లో కూడా కొవాగ్జిన్ 77% ప్రభావవంతంగా పనిచేస్తుందని రుజువైందన్నారు.