మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్
15 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ
ఆదిలాబాద్ రూరల్, ఏప్రిల్ 22: పేదింటి ఆడబిడ్డలకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు వరంగా మారాయని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని కైలాస్నగర్లో గల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం 15 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని కొనియాడారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు మాస్కు ధరించడంతో పాటు భౌతికదూరం పాటించాలని సూచించారు. 45ఏళ్లు పై బడినవారు టీకా వేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు యోగేశ్, శివకుమార్, రాజు, జడ్పీటీసీ అభ్యర్థి ఆరె నరేశ్, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
RGV దెయ్యం క్లోజింగ్ కలెక్షన్స్ ఎంతో తెలుసా
వకీల్ సాబ్ 13 డేస్ కలెక్షన్స్ ఎంతంటే..