బెంగళూరు: కరోనా థర్డ్ వేవ్ను ఎదుర్కొనేందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు కర్ణాటక కూడా సిద్ధం అవుతున్నది. ఆ దిశగా మరో అడుగు ముందుకేసి 16 ఏండ్ల లోపు బాలలకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నది.
ప్రయోగాత్మకంగా హవేరి జిల్లాలో పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహణ ప్రారంభించామని రాష్ట్ర హోంమంత్రి బస్వరాజ్ బొమ్మై చెప్పారు. ఈ కార్యక్రమం ఈ నెల 25 నుంచి మొదలైంది. వచ్చేనెలాఖరు వరకు కొనసాగుతుంది.
జిల్లాలో 2.75 లక్షల మంది పిల్లలకు ముందే పౌష్టికాహార పరీక్షలు చేపట్టారు. పోషకాహార లోపం ఉన్న పిల్లలు తక్కువేనని అధికారులు చెప్పారు. త్వరలో ఈ కార్యక్రమాన్ని రాష్ట్రమంతా విస్తరించే యోచనలో ఉన్నట్లు సమాచారం.
కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందన్న నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో ముందే పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని మంత్రి బస్వరాజ్ బొమ్మై వివరించారు.