మంథని టౌన్/మంథని రూరల్, ఏప్రిల్ 19: రైతుల చివరి ధాన్యం గింజ వరకూ కొనుగోళ్లు చేస్తామని మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ తెలిపారు. మంథని పీఏసీఎస్ ఆధ్వర్యంలో మంథని మున్సిపల్ పరిధిలోని శ్రీరాంనగర్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పుట్ట శైలజ, అక్కెపల్లి, పుట్టపాక, మైదుపల్లి, గాజులపల్లిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను పీఏసీఎస్ చైర్మన్ కొత్త శ్రీనివాస్, జడ్పీటీసీ తగరం సుమలత, ఎంపీపీ కొండ శంకర్, ఏఎంసీ చైర్మన్ శ్రీరాంభట్ల సంతోషిణి, సింగిల్ విండో వైస్ చైర్మన్ బెల్లంకొండ ప్రకాశ్రెడ్డి సోమవారం వేర్వేరుగా ప్రారంభించారు. కార్యక్రమాల్లో సర్పంచులు సిద్ధ రాజయ్య, కారెంగుల సుధాకర్, తమ్మిశెట్టి కవిత, ఆర్బీఎస్ మండల కోఆర్డినేటర్ ఆకుల కిరణ్, ఎంపీటీసీలు పెగడ శ్రీనివాస్, చెరుకుతోట ఓదెలు, కౌన్సిలర్ నక్క నాగేంద్ర, డైరెక్టర్లు మాచీడి రాజుగౌడ్, ఆకుల రాజబాబు, ఓదెల, కిషన్రెడ్డి, కొత్త శ్రీనివాస్, దేవళ్ల విజయ్కుమార్ ఉన్నారు.
పెద్దపల్లి రూరల్, ఏప్రిల్ 19: పెద్దపల్లి మండలం గుర్రాంపల్లి, మారెడుగొండలో పెద్దపల్లి పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను విండో చైర్మన్ మాదిరెడ్డి నర్సింహారెడ్డి ప్రారంభించారు. కార్యక్రమాల్లో సర్పంచులు కన్నం జయ్, మాదిరెడ్డి భాగ్యలక్ష్మి, సీఈవో మధు తదితరులు పాల్గొన్నారు.
‘కేంద్రం’ వద్దన్నా..
రామగిరి, ఏప్రిల్ 19: రైతు సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ భరోసాగా నిలిస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం వద్దన్నా నూరుశాతం ధాన్యం కొనుగోళ్లు చేసేందుకు ఆదేశాలు జారీ చేశారని కమాన్పూర్ ఏఎంసీ చైర్మన్ పూదరి సత్యనారాయణ గౌడ్ తెలిపారు. బేగంపేట, నవాబ్పేట, నాగెపల్లి, లద్నాపూర్, రత్నాపూర్, కల్వచర్ల, లొంకకేసారం, సుందిళ్ల, ముస్త్యాల, చందనాపూర్లో కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ ఆరెల్లి దేవక్క, జడ్పీటీసీ మేదరబోయిన శారదకుమార్ యాదవ్, పీఏసీఎస్ చైర్మన్ ఇనగంటి భాస్కరరావుతో కలిసి ఆయన ప్రారంభిచారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కాపురబోయిన శ్రీదేవి భాస్కర్, సర్పంచ్, ఎంపీటీసీలు బుర్ర పద్మ శంకర్, గాజుల ప్రశాంతి, కరుణ కుమారస్వామి, కొండవేన ఓదెలు, బడికెల విజయ శ్రీనివాస్, మేడగోని ఉమ రాజన్న, పల్లె ప్రతిమ పీవీ రావు, ధర్ముల రాజ సంపత్, గంట పద్మ వెంకటరమణా రెడ్డి, ఎండీ మంజూర్, సందీప్, దాసరి లక్ష్మి, రామగిరి లావణ్య నాగరాజు, దాసరి శంకర్, కో-ఆప్షన్ సభ్యుడు ఇబ్రహీం, డైరెక్టర్లు ఆసం తిరుపతి, బాబర్, నాయకులు గాజుల ప్రసాద్, వేగోలపు మల్లయ్య, గద్దల శంకర్, ప్రశాంత్, రాజిరెడ్డి, మోహన్, ఆరిఫ్, తిరుపతి, సాగర్ రావు, ఏపీఎం స్వరూప ఉన్నారు.
ధర్మారం, ఏప్రిల్19: నంది మేడారం సింగిల్ విండో ఆధ్వర్యంలో బొట్లవనపర్తి, బుచ్చయ్యపల్లి, నర్సింహులపల్లి, కానంపల్లి, రామయ్యపల్లి, దొంగతుర్తి, ఖిలావనపర్తిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను నంది మేడారం ప్యాక్స్ చైర్మన్ ముత్యాల బలరాంరెడ్డి ప్రారంభించారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశాల మేరకు ఈ కేంద్రాలను ప్రారంభించామని వివరించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గుర్రం మోహన్ రెడ్డి, ఆర్బీఎస్ మండల కోఆర్డినేటర్ పాకాల రాజయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పెంచాల రాజేశం, సర్పంచులు రెడపాక ప్రమీల, అడువాల అరుణజ్యోతి, గుర్రం మనీషా, రేగుల సదన్బాబు, పాలకుర్తి సత్తయ్య, సాగంటి తార, ఎంపీటీసీలు మోతె సుజాత, బెల్లాల రోజారాణి, దాడి సదయ్య తదితరులు పాల్గొన్నారు.