శ్రీనగర్: జమ్ముకశ్మీర్ రాష్ట్రం సోపోర్ జిల్లాలోని మున్సిపల్ కార్యాలయంలో జరుగుతున్న ప్రజాప్రతినిధుల సమావేశమే లక్ష్యంగా ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ కౌన్సిలర్ షంషుద్దీన్ పీర్ ఈ ఉదయం మృతిచెందారు. సోపోర్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ కాల్పుల్లో మృతిచెందిన వారి సంఖ్య మొత్తం మూడుకు చేరింది.
సోమవారం మధ్యాహ్నం సోపోర్లోని మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిలర్లు సమావేశమయ్యారు. దాంతో ఉగ్రవాదులు ఆ సమావేశమే లక్ష్యంగా ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఆకస్మిక పరిణామానికి హడలిపోయిన కౌన్సిలర్లు, ఇతర సిబ్బంది ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. కానీ, అప్పటికే ఒక కౌన్సిలర్ రియాజ్ అహ్మద్, గన్ మ్యాన్ షఫ్కత్ అహ్మద్ ఉగ్రవాదుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. పారిపోయిన ఉగ్రవాదుల కోసం పోలీసులు గాలింపు కొనసాగుతున్నది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
పున్నమి చంద్రుడే ఆ నౌకను కదిలించాడు.. !
ఫరూక్ అబ్దుల్లాకు కరోనా పాజిటివ్
భారత మహిళా క్రికెటర్ హర్మన్ప్రీత్ కౌర్కు కరోనా పాజిటివ్