న్యూఢిల్లీ: ఒక ఏనుగు తన తొండంతో బోరు పంపును కొట్టి నీరు తాగిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. ఏనుగులు చాలా తెలివైన జంతువులు. ఇవి గొప్ప జ్ఞాపకశక్తిని కలిగి ఉంటాయి. భూమిపై జీవించే జంతువులలో అతిపెద్ద మెదడును కలిగి ఉన్న జంతువు ఏనుగే. ఇవి మానవుల కంటే మూడు రెట్లు ఎక్కువ న్యూరాన్లు కలిగి ఉంటాయి. అందుకే మానవులను చూసి అనుకరించే వీటి హావభావాలు, చేసే పనులు అందరినీ ఆశ్చర్యపరుస్తాయి.
బాగా దాహంతో ఉన్న ఒక ఏనుగు ఒక బోరు పంపు వద్దకు వస్తుంది. అక్కడున్న ముగ్గురు మనుషులపై ఆధారపడకుండా తొండంతో బోరు పంపును కొట్టి నీటిని తాగుతుంది. ఏనుగు చేసిన ఈ చర్యకు అక్కడున్న ముగ్గురు కూడా ఆశ్చర్యపోయారు. మరోవైపు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఏనుగు తెలివికి నెటిజన్లు కూడా ఎంతో ముగ్ధులయ్యారు.