మహారాష్ట్రకు నిపుణుల హెచ్చరిక
ముంబై, ఏప్రిల్ 28: ప్రజలకు టీకాలు వేసే కార్యక్రమం మందగమనంతో మహారాష్ట్ర కరోనా మూడో దశ ఉద్ధృతిని (మూడో వేవ్ను) ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్య నిపుణులు హెచ్చరించారు. దేశం మొత్తం మీద మహారాష్ట్రలోనే కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉంది. మరోవైపు కరోనా టీకా డోసులు సరిపడా లేకపోవడంతో వ్యాక్సినేషన్ కార్యక్రమం మందగించిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. సరిపడా డోసులు లేనందున వచ్చే నెల 1 నుంచి 18-44 ఏండ్ల వారికి టీకాలు వేసే కార్యక్రమాన్ని తాము ప్రారంభించడం లేదని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రోజే నిపుణుల హెచ్చరిక వెలువడటం గమనార్హం.