లక్నో : ఉత్తర ప్రదేశ్లో మూడో దశ పంచాయతీ ఎన్నికలకు సోమవారం ఓటింగ్ జరగనుంది. రాష్ట్రంలోని 20 జిల్లాల్లో జరిగే ఈ ఎన్నికల్లో 2.14 లక్షలకు పైగా సీట్లలో 3.52 లక్షలకు పైగా అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది.
జిలా పంచాయతీల్లో 746 మంది సభ్యులకు గాను 10,627 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. క్షేత్ర పంచాయతీల్లో 18,530 స్థానాలకు గాను 89,188 మంది అభ్యర్థులు ఉన్నారు. 14,397 గ్రామ పంచాయతీలకు 1,177,89 మంది అభ్యర్థులు పోలింగ్ బరిలో ఉన్నారు. 1,80,473 గ్రామ పంచాయతీ వార్డులకు 1,34,510 మంది అభ్యర్థులు ఎన్నికలలో పోటీ చేస్తున్నారు.
ఏప్రిల్ 15 న జరిగిన మొదటి దశలో పోలింగ్లో సగటున 71 శాతం పోలింగ్ నమోదైంది. ఏప్రిల్ 19న జరిగిన రెండవ దశ పోల్స్లో కూడా 71 శాతం పోలింగ్ జరిగింది. 2015 పంచాయతీ ఎన్నికలలో 72.11 పోలింగ్ శాతం నమోదైందని ఎస్ఈసీ తెలిపింది.