ముంబై, అక్టోబర్ 9: ఓ రైలులో 20 ఏండ్ల మహిళపై 8 మంది దోపిడీదొంగలు గ్యాంగ్రేప్ చేశారు. 16 మంది ప్రయాణికులను చావబాది సొత్తు దోచుకున్నారు. లక్నో నుంచి ముంబై వెళుతున్న పుష్పక్ ఎక్స్ప్రెస్లో శుక్రవారం రాత్రి ఈ దారుణ ఘటన చోటుచేసుకున్నది. 8 మంది దొంగలు ఇగత్పురి (ఔరంగాబాద్ రైల్వే జిల్లా) స్టేషన్లో స్లీపర్ బోగీలోకి ఎక్కారు. ప్రయాణికులను బ్లేడ్లు, కత్తులతో బెదిరించి వారిని లూటీ చేశారు. పలువుర్ని తీవ్రంగా కొట్టారు. ఒక మహిళా ప్రయాణికురాలిపై సామూహిక లైంగికదాడి చేశారు. ఇద్దరు దొంగలను ప్రయాణికులు పట్టివేయగా మిగతావారు పరారయ్యారు.