ముంబై: మహారాష్ట్రలోని పూణే జిల్లాలో కరోనా పరిస్థితి కలకలం రేపుతున్నది. గత 24 గంటల్లో కొత్తగా 12,090 కేసులు, 70 మరణాలు నమోదయ్యాయి. దీంతో పూణే జిల్లాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,16,127కు, మరణాలు 10,472కు పెరిగాయి. గురువారం 6,948 మంది కరోనా రోగులు కోలుకున్నారు. దీంతో పూణే జిల్లాలో కోలుకున్నవారి మొత్తం సంఖ్య 5,16,226కు చేరింది. ప్రస్తుతం జిల్లాలో 89,589 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నట్లు వైద్యాధికారులు తెలిపారు.