అవన్నీ ఒట్టి మాటలే: బీహార్ సీఎం

పట్నా: జేడీయూ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నాంటూ ఆర్జేడీ నేత శ్యామ్ రజాక్ చేసిన వ్యాఖ్యలను బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ సీనియర్ నేత నితీశ్కుమార్ తోసిపుచ్చారు. అవన్నీ ఒట్టి మాటలేనని కొట్టిపారేశారు. జేడీయూ నుంచి 17 మంది కాదు కదా ఒక్కరు కూడా ఆర్జేడీలోకి వెళ్లబోరని తేల్చిచెప్పారు. ఈ మధ్యాహ్నం ఆర్జేడీ నేత శ్యామ్ రజాక్ మీడియాతో మాట్లాడుతూ.. జేడీయూకు చెందిన 17 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని చెప్పారు.
ఏ క్షణమైనా ఆ 17 మంది ఎమ్మెల్యేలు ఆర్జేడీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని రజాక్ వ్యాఖ్యానించారు. అయితే, తాము మొత్తం 28 మంది గ్రూప్గా రావాలని వారికి సూచించామని, అతి త్వరలోనే వారి సంఖ్యాబలం 28కి చేరుకుంటుందని, ఆ రోజుతో నితీశ్ సర్కారు కుప్పకూలుతుందని రజాక్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని మీడియా ప్రతినిధులు నితీశ్కుమార్ ముందు ప్రస్తావించగా.. అవి నిరాధార వ్యాఖ్యలని కొట్టిపారేశారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- వరుసగా రెండో మ్యాచ్లోనూ ఓడిన సింధు
- కల్లుగీస్తుండగా ప్రమాదం..వ్యక్తికి గాయాలు
- ఫిబ్రవరి 2న సీబీఎస్ఈ ఎగ్జామ్స్ షెడ్యూల్
- 11 నెలలు..50 దేశాలు..70,000 కిలోమీటర్లు
- హెచ్1-బీ వీసా.. కొత్త వేతన నిబంధనల అమలు వాయిదా
- 20 నిమిషాలు..కోటి రెమ్యునరేషన్..!
- ప్రజలను రెచ్చగొట్టే టీవీ ప్రోగ్రామ్లను ఆపేయండి..
- ‘టాయ్ ట్రైన్ను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్’
- అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా మమతా తీర్మానం
- త్వరలోనే నిరుద్యోగ భృతి : మంత్రి కేటీఆర్