న్యూఢిల్లీ: కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో భారీ మార్పులు, చేర్పులు చేసింది. ఇందులో భాగంగా ఏకంగా 43 మంత్రులు రాష్ట్రపతి భవన్లో బుధవారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన 43 మందిలో కొందరు ఇప్పటికే ఉన్న మంత్రులకు కొత్త శాఖలు, ప్రమోషన్లు ఉండగా.. మరికొందరు తొలిసారి కేబినెట్లోకి వస్తున్నారు.