కోల్కతా: పశ్చిమబెంగాల్లో అక్రమ చొరబాటుదార్లకు అడ్డుకట్ట వేయాల్సిందేనని కేంద్ర హోంమంత్రి అమిత్షా వ్యాఖ్యానించారు. అక్రమ చొరబాటుదార్లు యువకుల ఉపాధి అవకాశాలపైన, ఆర్థిక మూలాలపైన దెబ్బకొడుతున్నారని ఆయన మండిపడ్డారు. అక్రమ చొరబాటుదార్లను కట్టడి చేయకపోతే ప్రమాదం కేవలం బెంగాల్కు మాత్రమే కాదని, దేశానికే ప్రమాదమని షా హెచ్చరించారు.
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అమిత్ షా శుక్రవారం తెహట్టాలో రోడ్ షో నిర్వహించారు. 70 ఏండ్లుగా ఇక్కడికి వచ్చి కొందరు శరణార్థి జీవితాలను గడుపుతున్నారని, వారికి పౌరసత్వం ఇవ్వడానికి తాము కృషి చేస్తున్నామని చెప్పారు. వారి కోసం రూ.100 కోట్ల ఫండ్ను ఏర్పాటు చేశామని, వారికి పౌరసత్వం కూడా ఇస్తామని ప్రకటించారు.
దేశంలో ఒక టూరిస్ట్ లీడర్ ఉన్నారంటూ రాహుల్ గాంధీని ఉద్దేశించి అమిత్ షా వ్యాఖ్యానించారు. ‘దేశంలో ఒక టూరిస్ట్ నేత ఉన్నారు. ఎన్నికలకు సంబంధించిన చాలా దశలు ముగిసిపోయాయి. కానీ రాహుల్ గాంధీ ఎక్కడా కనిపించడం లేదు. కేవలం ఒకే ఒక ర్యాలీ నిర్వహించారు. బీజేపీ డీఎన్ఏ గురించి ఆయన ప్రశ్నించారు. మా డీఎన్ను గురించి మీరు అడగకండి. అభివృద్ధి, జాతీయత, ఆత్మనిర్భర భారత్తో కూడిన డీఎన్ఏ మాది’ అని అమిత్ షా ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.
ఇవికూడా చదవండి..
తెలంగాణలో కొత్తగా 3,840 కరోనా కేసులు
పాదాల పగుళ్లు పోవాలంటే ఈ చిట్కాలు పాటించాలి..!
పండుగకు పుట్టింటికి కూతురు.. కాల్చిచంపిన కన్నతండ్రి..!
సీబీఐ మాజీ చీఫ్ రంజిత్ సిన్హా మృతి
కోడిగుడ్డులో పచ్చసొనను పడేస్తున్నారా.. అయితే ఇది చదవాల్సిందే..!
30 కోట్లతో స్వర్గ సీమను నిర్మించుకున్న కంగనా రనౌత్
కేంద్ర పోలీసు బలగాల్లో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులు