మేడ్చల్ మల్కాజిగిరి : కరోనా మహమ్మారి వారి కుటుంబం పాలిట పెను శాపంగా మారింది. కరోనా బారిన పడి కుమారుడు నాలుగు రోజుల క్రితం మృత్యువాత పడ్డాడు. బెంగతో నేడు తండ్రి తనువు చాలించాడు. ఈ హృదయవిదారకర సంఘటన నాగారం మున్సిపాలిటీలోని రాంపల్లిలో చోటు చేసుకుంది.
స్థానికుల కథనం మేరకు.. రాంపల్లికి చెందిన నీరుడి వాసుకు కరోనా సోకడంతో హైదరాబాద్ నగరంలోని ఓ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తనువు చాలించాడు. ఎదిగిన కొడుకు మృతి చెందటంతో తీవ్ర మనోవేదనకు గురైన వాసు తండ్రి బాలయ్య.. కొడుకు జ్ఞాపకాలను తలుచుకొని బాధపడుతూ మృతి చెందాడు.
ఒకే ఇంట్లో తండ్రీ, కొడుకు మృతి చెందడం వారి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
అంబులెన్స్లో ప్రసవం..తల్లి, బిడ్డ క్షేమం
దళారుల బెడద అరికట్టేందుకే కొనుగోలు కేంద్రాలు
తెలంగాణలోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు
రాధాకృష్ణను పరామర్శించిన మంత్రి ఐకే రెడ్డి