సిటీబ్యూరో, మే 25 (నమస్తే తెలంగాణ)/బేగంపేట్ : యూనివర్సిటీ వైస్ చాన్సలర్ల నియామకంలో వెనుకబడిన వర్గాలకు సముచిత స్థానం కల్పించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్సలర్గా నియమితులైన రవీందర్ యాదవ్ మంగళవారం వెస్ట్ మారేడ్పల్లిలోని మంత్రి నివాసంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి నూతన వీసీని శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో ఎంతో ఉన్నతమైన చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీకి యాదవ సామాజిక వర్గానికి చెందిన రవీందర్ యాదవ్ను నియమించినందుకు సీఎం కేసీఆర్కు యాదవ జాతి తరపున మంత్రి తలసాని కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాలకు రాజకీయంగా, సామాజికంగా సముచిత స్థానం కల్పిస్తూ అభివృద్ధికి తోడ్పాటును అందిస్తుందని చెప్పారు. ఈ వర్గాల అభ్యున్నతికి అన్ని విధాలుగా కృషి చేస్తున్న సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటారన్నారు. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పనిచేసి ఉస్మానియా యూనివర్సిటీకి మరింత గుర్తింపును తీసుకురావాలని ఈ సందర్భంగా రవీందర్ యాదవ్ను మంత్రి కోరారు.