ముంబై: ముంబై మేయర్ కిషోరి పడ్నేకర్ ఇవాళ మీడియాతో మాట్లాడారు. కోవిడ్ మృతుల డేటాను దాచిపెట్టడం లేదన్నారు. నగరంలో డేటాను రహస్యంగా కప్పిపెట్టలేదన్నారు. ముంబైలో కోవిడ్ మృతులను గుట్టుచప్పడుకాకుండా పడేసేందుకు ఇక్కడ నది లేదని ఆమె అన్నారు. ముంబైలో కోవిడ్ వల్ల చనిపోతున్నవారి వివరాలను మూడు ప్రదేశాల్లో నమోదు చేస్తున్నారని, అందుకే ఎక్కడా డేటాను దాచిపెట్టేదిలేదని ఆమె అన్నారు. సెకండ్ వేవ్ సమయంలో యూపీ, బీహార్ రాష్ట్రాల్లో గంగా నదిలో కోవిడ్ మృతులను పడేసిన విషయం తెలిసిందే. అయితే మీడియా అడిగిన ప్రశ్నకు ఆమె బదులిస్తూ ఇలా కౌంటర్ ఇచ్చారు. మలాడ్లో కూలిన బిల్డింగ్ ఘటన పట్ల ఆమె స్పందిస్తూ.. నిందితులే దానికి బాధ్యత వహించాలన్నారు. ఎవరి ప్రభుత్వ పాలనలో ఆ నిర్మాణం సాగిందో గమనించాలన్నారు.