ములుగురూరల్ మార్చి31: ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ విజృంభించే అవకాశం ఉందని, ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారి అల్లెం అప్పయ్య అన్నారు. రామచంద్రాపురం గ్రామంలో ఒకే కుటుంబంలో ఐదుగురికి కరోనా పాజిటివ్ రాగా బుధవారం ఆయన ఆరుగురు వైద్య బృందంతో గ్రామానికి చేరుకున్నారు. ఈ మేరకు పాజిటివ్ వచ్చిన వ్యక్తులకు ధైర్యం చెప్పి వారిని 14 రోజుల పాటు హోం క్వారైంట్లో ఉండాలని సూచించారు. అనంతరం 15 మంది ప్రైమరీ కాంట్రాక్టులను గుర్తించి రాపిడ్ టెస్టు నిర్వహించగా ఎవరికీ పాజిటివ్ రాలేదని తెలిపారు. జిల్లా వైద్యాధికారి మాట్లాడుతూ ప్రజలు బయటకు వెళ్లినప్పుడు. సామాజిక దూరం పాటిస్తూమాస్కు ధరించాలని అన్నారు. సానిటైజర్లను వినియోగిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అన్నారు. ఆరు టీంలలో నలుగురు చొప్పున వైద్య సిబ్బంది గ్రామంలోని 635 ఇళ్లలో సర్వే చేసినట్లు వివరించారు. జిల్లా ర్యాపిడ్ రెస్పాండ్ బృందం సభ్యులు దుర్గారావు, నవీన్రాజ్కుమార్, తిరుపతయ్య మైక్ ద్వారా అవగాహన కల్పించినట్లు వివరించారు. జలుబు, దగ్గు, జ్వరం ఉన్నట్లయితే అందుబాటులోని పీహెచ్సీని కానీ, జిల్లా ప్రభుత్వ దవాఖానను సంప్రదించాలని సూచించారు. రాయినిగూడెం పీహెచ్సీ వైద్యాధికారి పోరిక రవీందర్, సర్పంచ్ కల్పనా రూప్సింగ్, కార్యదర్శి, ఆశ వర్కర్లు, సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.