న్యూఢిల్లీ: దేశమంతా కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తున్న వేళ.. కరోనా బాధితులను, కరోనా బారినపడి మరణించిన వారి మృతదేహాలను తరలించడంలో అంబులెన్స్ డ్రైవర్ల కృషిని ఎప్పటికీ మరువలేమని ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఉదయం అలిండియా రేడియోలో దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన.. కరోనాపై యుద్ధంలో అంబులెన్స్ డ్రైవర్లు బృహత్తరమైన పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. వారి సేవలకు తాను మనసారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని చెప్పారు.
ఈ సందర్భంగా ప్రేమ్ జీ అనే ఒక అంబులెన్స్ డ్రైవర్తో ప్రధాని మాట్లాడారు. ఒక అంబులెన్స్ డ్రైవర్గా అతని అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. మే 1 తర్వాత ఉచిత కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకోవాలని సూచించారు. కరోనా కట్టడికి సంబంధించి ఆలిండియా రేడియోలో దేశ ప్రజలకు సందేశం ఇవ్వమని ప్రధాని కోరారు. దాంతో డ్రైవర్ ప్రేమ్ జీ అందరూ వ్యాక్సిన్ వేసుకోవాలని, కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి
దేశాన్ని మహమ్మారి ఉక్కిరిబిక్కిరి చేసింది: ప్రధాని మోదీ
రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో వర్షాలు : ఐఎండీ
కొవిడ్ హాస్పిటల్లో మంటలు.. 23 మంది రోగుల మృతి
సుప్రీం కోర్టు జడ్జి మోహన్ ఎం శాంతనగౌడర్ కన్నుమూత
రాష్ట్రంలో కొత్తగా 8 వేల కరోనా కేసులు