న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. రోజూ 20 వేలకుపైగా కొత్త కేసులు నమోదవుతన్నాయి. మంగళవారం ఉదయానికి గడిచిన 24 గంటల్లో కూడా 23 వేలకుపైగా మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. కేసులు పెరుగుతుండటంతో ఢిల్లీలో ఆస్పత్రులు కిక్కిరిసిపోతున్నాయి. ఢిల్లీ ఆస్పత్రుల్లో మొత్తం 18,923 పడకలు అందుబాటులో వాటిలో ఇప్పటికే 16,461 పడకలు రోగులతో నిండిపోయాయి.
మరో 2,462 పడకలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా కొవిడ్ రోగుల సౌకర్యార్థం రాధా సవోమీ సత్సంగ్ బియాస్ను ఇవాళ్టి నుంచి పునఃప్రారంభించనుండగా, మొత్తం 600 పడకలతో ఈ కామన్వెల్త్ గేమ్స్ విలేజ్ అందుబాటులోకి రానున్నది. ఈ వివరాలను ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ మీడియాకు వెల్లడించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి.
మునక్కాయల కన్న మునగాకే మిన్న..!
మే 1 వరకు తెలంగాణలో నైట్ కర్ఫ్యూ
సంచలన నిర్ణయం తీసుకున్న ఛార్మీ
ఐసీఎస్ఈ 10వ బోర్డు పరీక్షలు రద్దు..
వ్యాక్సిన్లపై దిగుమతి సుంకం ఎత్తివేత!