జెనీవా : మయన్మార్లో అంతర్యుద్ధం జరిగే అవకాశాలు ఉన్నాయంటూ ఐక్యరాజ్య సమిగి హెచ్చరించింది. మిలిటరీ జుంటాకు వ్యతిరేకంగా ప్రజలు తమను తాము సిద్ధం చేసుకుంటున్నారని, నిరసనకారులు ఇంట్లో తయారుచేసుకుంటున్న ఆయుధాలను ఉపయోగించి రక్షణాత్మక విధానాన్ని తీసుకోవటానికి బదులు దూకుడుగా వ్యవహరించడం ప్రారంభించారని పేర్కొన్నది. ఇదే సమయంలో మయన్మార్లోని ఒక వార్తా పత్రిక సంపాదకుడు డానీ ఫెన్స్టర్ను సైన్యం అరెస్టు చేసింది. సైనిక తిరుగుబాటు తర్వాత ఇది నాలుగో విదేశీ జర్నలిస్ట్ అరెస్ట్ కావడం విశేషం.
ఐక్యరాజ్యసమితి డిజిటల్ మీడియా సమావేశంలో యూఎన్ ప్రత్యేక ప్రతినిది క్రిస్రిన్ ష్రైనర్ బెర్జ్నర్ మాట్లాడారు. ప్రజలు సైనిక దాడులకు భయపడుతున్నందున.. వారు తమ ఆత్మరక్షణ చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలగొట్టి సైన్యం అధికారం చేపట్టిందని, అప్పటి నుంచి విస్తృతమైన హింసను నిత్యం చూస్తున్నామని విచారం వ్యక్తం చేశారు. ఇది దేశంలో అంతర్యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉన్నదన్నారు.
“చర్చలకు ఇరు పక్షాలు అంగీకరించడం అంత సులభం కాదు. కాని మరింత రక్తపాతం, సుదీర్ఘమైన అంతర్యుద్ధాన్ని నివారించడానికి ముందుకురావాలి. ఇక్కడి పరిస్థితి గురించి ఆందోళన చెందుతున్నాం. దేశం సాధారణ స్థితికి రావడాన్ని ఎలా చూడాలనుకుంటున్నారో ఆ దేశ ప్రజలు నిర్ణయించుకోవాలని మేం కోరుకుంటున్నాం” అని బెర్జ్నర్ చెప్పారు. మయన్మార్ పరిస్థితిని చాలా ఘోరంగా అభివర్ణించిన బెర్జ్నర్.. ఇప్పటివరకు మయన్మార్లో 800 మందికి పైగా మరణించారని, దాదాపు 5,300 మందిని అరెస్టు చేశారని, 1,800 మందికి పైగా సైన్యం అరెస్ట్ వారెంట్లు జారీ చేసిందని చెప్పారు.
విరాట్ సేనకు వెటరన్ క్రికెటర్ రిచర్డ్ హాడ్లీ ప్రశంసలు
ఒలింపియన్ సుశీల్ కుమార్ను సస్పెండ్ చేసిన రైల్వే
సీబీఐ డైరెక్టర్ ఎంపిక : జస్టిస్ రమణ అభ్యంతరంతో ఇద్దరి పేర్లు ఔట్..?!
అమరీందర్కు పక్కలో బళ్లెంలా సిద్దూ
నక్సల్స్ దాడిలో కాంగ్రెస్ నేతల మృతి.. చరిత్రలో ఈరోజు
‘హవానా సిండ్రోమ్’ : అమెరికాను కలవరపెడుతున్న మైక్రోవేవ్ దాడులు
సహజంగా బరువు తగ్గేందుకు ఈ పండ్లు తినండి..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..